జూన్​ 24 : గుడ్​ న్యూస్​! గరిష్ఠ స్థాయిల నుంచి దిగొస్తున్న బంగారం ధరలు..-gold price today silver rate 24th june 2025 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 24 : గుడ్​ న్యూస్​! గరిష్ఠ స్థాయిల నుంచి దిగొస్తున్న బంగారం ధరలు..

జూన్​ 24 : గుడ్​ న్యూస్​! గరిష్ఠ స్థాయిల నుంచి దిగొస్తున్న బంగారం ధరలు..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు జూన్​ 24, మంగళవారం స్వల్పంగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 60 తగ్గి రూ. 1,00,853గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 10,085గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 పడి రూ. 92,463కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,246గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,315 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,00,705గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,701గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 92,305గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,00,695గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,319గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,709గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,325గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,715గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 92,327- రూ. 1,00,717గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,371గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,00,761గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 92,310గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,700గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ వార్తలు అంతర్జాతీయ అనిశ్చితిని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆల్​-టైమ్​ హా దగ్గర ఉన్న బంగారం ధరలు నిదానంగా దిగొస్తున్నాయి.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,13,000కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,23,200 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,24,000గా ఉంది. విశాఖపట్నంలో 1,21,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం