Gold price today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన బంగారం ధర- వెండి కూడా!-gold price today on diwali 2023 november 12 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన బంగారం ధర- వెండి కూడా!

Gold price today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన బంగారం ధర- వెండి కూడా!

Sharath Chitturi HT Telugu

Gold price today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొచ్చాయి. వెండి ధర భారీగా పడింది. ఆ వివరాలు..

దేశంలో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Sanjay Sharma)

Gold price today : దేశంలో బంగారం ధరలు ఆదివారం దిగొచ్చాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 450 తగ్గి.. రూ. 55,550కి చేరింది. శనివారం ఈ ధర రూ. 56,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4500 తగ్గి, రూ. 5,55,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,555గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 490 తగ్గి.. రూ. 60,600కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,090గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4900 దిగొచ్చి.. రూ. 6,06,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,060గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,600గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,090గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,060గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,600గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1000 తగ్గి.. రూ. 73,000కి చేరింది. శనివారం ఈ ధర రూ. 74,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,000.. బెంగళూరులో రూ. 72,750గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం