జూన్​ 29 : భారీగా పడిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు!-gold price today in hyderabad check silver rates here 29th june 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 29 : భారీగా పడిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు!

జూన్​ 29 : భారీగా పడిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు!

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు ఆదివారం దిగొచ్చాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీలోని ఒక బంగారు ఆభరణాల దుకాణంలో మోడల్స్​.. (PTI)

దేశంలో బంగారం ధరలు జూన్​ 29, ఆదివారం భారీగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 590 రూ. 97,593గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,759గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 దిగొచ్చి రూ. 89,473కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,947గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు తగ్గుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,325 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,445గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,321గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,441గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,315గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,435గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,329గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,449గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,335గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,445గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,337- రూ. 97,457గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,381గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,501గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,320గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,440గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,090గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,900కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,21,000 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,21,900గా ఉంది. విశాఖపట్నంలో 1,19,500గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం