దేశంలో బంగారం ధరలు మే 17, శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1220 పెరిగి.. రూ. 95,313కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,53,130కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 9,531గా కొనసాగుతోంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1120 వృద్ధి చెంది.. రూ. 87,383కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,830గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,235గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,165గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,383 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 95,313గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,231గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,161గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 87,237గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,167గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,239గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,169గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,245గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,175గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,247గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,177గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,291గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,221గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,230గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,160గా ఉంది.
అమెరికా- చైనా టారీఫ్ వార్పై అనిశ్చితి తొలగడం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. ఢిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 10,000గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,00,000కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,11,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ. 1,12,000.. బెంగళూరులో రూ. 1,09,600గా ఉంది.
సంబంధిత కథనం