ఏప్రిల్​ 16 : దిగొచ్చిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..-gold price today hyderabad silver rates in india 16th april 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 16 : దిగొచ్చిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..

ఏప్రిల్​ 16 : దిగొచ్చిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. వెండి ధరలు సైతం పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ 16, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీలోని ఒక జ్యువెల్లరీ ఎగ్జిబిషన్​లో బంగారు ఆభరణాలతో మోడల్స్​.. (Hindustan Times)

దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 16, బుధవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 330 తగ్గి.. రూ. 95,343కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3300 తగ్గి.. రూ. 9,53,430గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 తగ్గి.. రూ. 87,363కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3500 తగ్గి రూ. 8,73,630కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 8,736గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పడ్డాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,215 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,195గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,363గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,343గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,211గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,191గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 87,217గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,197గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,219గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,199గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,225గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,205గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,271గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,251గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,190గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ వార్నింగ్​, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,280గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 1,02,800కి చేరింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,13,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,03,600.. బెంగళూరులో రూ. 1,01,800గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం