Today gold price : పసిడి ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన బంగారం ధరలు!-gold price today 30 september news in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today 30 September News In Telugu

Today gold price : పసిడి ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

Sharath Chitturi HT Telugu
Sep 30, 2022 06:12 AM IST

Today gold price : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..

Today gold price : దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 600 పెరిగి.. రూ. 46,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 45,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 6000 పెరిగి, రూ. 4,64,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 650 వృద్ధిచెంది.. రూ. 50,620కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 49,970గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 6,500 పెరిగి.. రూ. 5,06,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,050గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,430గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,650గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,450గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,670గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,400 పెరిగి.. 56,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 61,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,400.. బెంగళూరులో రూ. 56,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం కాస్త తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 190 తగ్గి.. రూ 22,170కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 22,360గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 22,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం