ఏప్రిల్​ 22 : 98,500కు చేరువలో బంగారం ధర! నేటి వెండి రేటు ఇలా..-gold price today 22k silver rate 22nd april 2025 in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 22 : 98,500కు చేరువలో బంగారం ధర! నేటి వెండి రేటు ఇలా..

ఏప్రిల్​ 22 : 98,500కు చేరువలో బంగారం ధర! నేటి వెండి రేటు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కానీ ఆల్​-టైమ్​ హై వద్ద కొనసాగుతున్నాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (PTI)

దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 22, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 98,533గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,85,330గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,853గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 90,333గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,03,650గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,033గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,333గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,533గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,185 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,385గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,181గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,381గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,187గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,387గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,189గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,389గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,195గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,395గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,241గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,441గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,180గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,380గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కో, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 1,030గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,03,000గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,05,000.. బెంగళూరులో రూ. 1,03,200గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం