ఏప్రిల్​ 27 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం ధరలు ఇలా..-gold price today 22k in hyderabad and vijayawada check silver rates here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 27 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం ధరలు ఇలా..

ఏప్రిల్​ 27 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

ఏప్రిల్​ 27 ఆదివారం నాడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేట్లు కూడా మారలేదు. ఈ నేపథ్యంలో మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 27, ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,353గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,83,530గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,835గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 90,213గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,02,130గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,021గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,065గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,255గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,213 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,353గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,061గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,251గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,055గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,245గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,069గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,259గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,075గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,265గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,121గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,311గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,250గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,050గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,00,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,05,800.. బెంగళూరులో రూ. 1,04,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం