జూన్​ 20 : తగ్గనంటున్న బంగారం ధర, వెండి రేటు కూడా పైపైకి- తెలుగు రాష్ట్రాల్లో ప్రైజ్​ ఇలా..-gold price today 20th june 2025 in hyderabad check silver rates here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 20 : తగ్గనంటున్న బంగారం ధర, వెండి రేటు కూడా పైపైకి- తెలుగు రాష్ట్రాల్లో ప్రైజ్​ ఇలా..

జూన్​ 20 : తగ్గనంటున్న బంగారం ధర, వెండి రేటు కూడా పైపైకి- తెలుగు రాష్ట్రాల్లో ప్రైజ్​ ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ముంబైలోని ఒక ఆభరణాల దుకాణంలో.. (Sandeep Mahankal)

దేశంలో బంగారం జూన్​ 20, శుక్రవారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 1,01,243కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 10,012గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 150 వృద్ధి చెంది.. రూ. 92,833కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,283గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,685గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,115గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,687 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,01,117గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,681గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,111గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 92,675గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,01,105గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,689గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,119గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,695గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,125గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,697గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,127గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,741గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,01,011గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 92,680గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,110గా ఉంది.

ఇరాన్​ ఇజ్రాయెల్​ ఉద్రిక్తతలు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దిల్లీలో.. 100 గ్రాముల వెండి ధర రూ. 11,520గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,15,200కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,25,400 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​1,26,200.. విశాఖపట్నంలో రూ. 1,23,800గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం