మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold price today 18th may 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మే 18న మీ నగరాల్లో పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు మే 18, ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 పడి.. రూ. 95,303కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పడి రూ. 9,53,030కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,530గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 పడి.. రూ. 87,373కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 8,73,730గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,737గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పడ్డాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,225గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,155గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,373 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,303గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,221గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,151గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 87,215గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,214గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,229గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,159గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,235గాను, 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 95,165గా ఉంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా 87237, 95167గా కొనసాగుతున్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,281గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,211గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,220గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,150గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,010గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి పెరిగి.. రూ. 1,00,100కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,13,000 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,12,100.. విశాఖపట్నంలో రూ. 1,09,700గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం