Gold price today : మరింత పడిన పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..
Gold price today : దేశంలో పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. వెండి ధరలు సైతం తగ్గాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold price today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,290కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 66,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,62,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,629గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,320కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,330గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,23,200గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,232గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,440గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,470గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,320గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,970గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,290గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,320గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,290గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,340గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,370గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,290గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
Silver price today : దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,090గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 90,900కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 91,000గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 95,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 90,900.. బెంగళూరులో రూ. 90,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 120 తగ్గి.. రూ. 25,610కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,730గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,610గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం