Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..
Gold price today : దేశంలో పసిడి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Gold price today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 67,250గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,72,500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,725గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 73,360గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,33,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,336గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,510గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,360గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,640గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,360గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,250గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,360గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,410గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,360గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,700గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 87,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.
Silver price today Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 90,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ.87,000.. బెంగళూరులో రూ. 87,100గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం