Gold Rate Today: భారీగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‍లో రేట్లు ఎలా ఉన్నాయంటే!-gold price hikes today silver rate also jump check latest prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Hikes Today Silver Rate Also Jump Check Latest Prices

Gold Rate Today: భారీగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‍లో రేట్లు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2023 07:13 AM IST

Gold Rate Today: బంగారం ధర మళ్లీ ఎగిసింది. అమాంతం పెరిగింది. వెండి కూడా రేటు పైకి వెళ్లింది. తాజా ధరలు ఇవే.

నేటి బంగారం ధరలు
నేటి బంగారం ధరలు

Gold Rate Today: వారం రోజులుగా స్థిరంగా ఉండడమో, స్వల్పంగా తగ్గడమో చేసిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ మార్కెట్‍లో అమాంతం పైకి వెళ్లాలి. గురువారం ఉదయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.55,850కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) పసిడి రేటు రూ.440 అధికమై రూ.60,930కు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ సహా దేశంలోని అన్ని సిటీల్లో గోల్డ్ రేటు పెరిగింది. ఢిల్లీ మార్కెట్‍లో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.56,000కు ఎగిసింది. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.61,080కు చేరింది.

హైదరాబాద్‍‍‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.55,850కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.60,930కు చేరింది. ఏపీలోని ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

అహ్మదాబాద్, బెంగళూరులో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.55,900కు చేరింది. 24 క్యారెట్లకు మేలిమి గోల్డ్ తులం రేటు రూ.60,980కు ఎగబాకింది. ముంబై, కోల్‍కతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,850కు పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930కు ఎగబాకింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్లకు చెందిన తులం పసిడి ధర రూ.56,450కు ఎగిసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.61,580కు పెరిగింది.

ప్రపంచ మార్కెట్‍లో గోల్డ్ రేట్లు మళ్లీ పెరగడం దేశీయ ధరలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర అంతర్జాతీయ మార్కెట్‍లో 1,966 డాలర్లకు చేరింది. అమెరికాలో గరిష్ట రుణ పరిమితిపై ఉత్కంఠ, డిమాండ్‍లో హెచ్చుతగ్గుల వల్ల బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో మార్పులు కూడా గోల్డ్ ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

పెరిగిన వెండి

దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా పెరిగింది. నేడు కిలో వెండి రేటు రూ.200 పెరిగి రూ.72,800కు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.76,800కు ఎగిసింది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతాల్లో కిలో వెండి రేటు రూ.72,800గా ఉంది.

(గమనిక: ఈ ధరల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

WhatsApp channel