Gold and silver rates today : దిగొచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే!
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 46,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 46,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 4,66,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 4,660గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 50,840కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,00గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 5,08,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,084గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,990గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,840గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,440గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,630గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,870గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,840గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,910గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,840గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 57,500కి చేరింది. సోమవారం కూడా ఇదే ధర ఉంది.
Silver rate today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 63,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 57,500.. బెంగళూరులో రూ. 57,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 తగ్గి.. రూ 24,860కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,9100గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం