Gold and silver rates today : ప్చ్.. మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు- ఎంతంటే!
Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 110 పెరిగి.. రూ. 56,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 56,490గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,100 పెరిగి, రూ. 5,66,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,660గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 120 వృద్ధి చెంది.. రూ. 61,750కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,630గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1200 పెరిగి.. రూ. 6,17,500గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,900గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,750గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,800గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,800గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,750గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,810గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 400 పెరిగి, రూ. 78,100గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 82,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 78,100.. బెంగళూరులో రూ. 82,700గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి రూ. 27,900కి చేరింది. క్రితం రోజు రూ. 27,850గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం