Gold and silver rates today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!-gold and silver rates today 7 february 2023 check prices in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 7 February 2023 Check Prices In Hyderabad

Gold and silver rates today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Feb 07, 2023 06:17 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 52,650కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 52,400గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2500 పెరిగి, రూ. 5,26,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,265గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 280 వృద్ధి చెంది.. రూ. 57,440కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,160గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2800 పెరిగి.. రూ. 5,74,400గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,590గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,440గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,530గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,440గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,490గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,120గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 71,200గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 71,200.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 110 పెరిగి రూ. 25,830కి చేరింది. క్రితం రోజు రూ. 25,720గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం