Gold and silver rates today : హైదరాబాద్​లో పసిడి, వెండి ధరల వివరాలివే..-gold and silver rates today 30th may 2023 check latest prices in hyderabad ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Gold And Silver Rates Today 30th May 2023 Check Latest Prices In Hyderabad

Gold and silver rates today : హైదరాబాద్​లో పసిడి, వెండి ధరల వివరాలివే..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇవే..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇవే.. (REUTERS)

Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. కాగా ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,550గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,55,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,555గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 60,600గా కొనసాగుతోంది. క్రితం రోజు సైతం ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,06,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,060గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,650గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,650గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,650గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది. సోమవారం సైతం ధర ఇంతే ఉంది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,000.. బెంగళూరులో రూ. 77,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 పెరిగి రూ. 27,240కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 27,150గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,240గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం