Gold and Silver rates today : భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..-gold and silver rates today 3 february check latest price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 3 February Check Latest Price In Hyderabad

Gold and Silver rates today : భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Feb 03, 2023 06:16 AM IST

Gold and Silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 600 పెరిగి.. రూ. 53,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 53,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,000 పెరిగి, రూ. 5,36,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,360గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 650 వృద్ధి చెంది.. రూ. 58,470కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,820గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,500 పెరిగి.. రూ. 5,84,700గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,610గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 58,470గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 53,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 58,470గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,470గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 58,510గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 53,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,470గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,470గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,400 పెరిగి 74,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 73,300గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,700.. బెంగళూరులో రూ. 77,800గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 20 పెరిగి.. రూ 26,510కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,490గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,510గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel