Gold and Silver rates today : దేశంలో గత కొంతకాలంగా దూసుకెళుతున్న బంగారం ధరలు శనివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 600 తగ్గి.. రూ. 52,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 53,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,000 తగ్గి రూ. 5,25,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,250గా ఉంది.,మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 660 తగ్గి.. రూ. 57,270కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6600 తగ్గి.. రూ. 5,72,700గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,727గా ఉంది.,Gold price today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,420గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 57,270గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.,కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,310గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,270గాను ఉంది.,Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,270గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.,అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,320గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,270గా ఉంది.,ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.,వెండి కూడా..దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,260గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 72,600గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర ఉంది.,Silver rates today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,600.. బెంగళూరులో రూ. 74,600గా ఉంది.,ప్లాటీనం ధరలు ఇలా..దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం భారీగా పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 740 తగ్గి.. రూ 26,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,160గా ఉండేది.,ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.),