Gold and Silver rates today : పసిడి ధరకు రెక్కలు.. హైదరాబాద్లో @53000
Gold and Silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 53,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 52,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.4,000 పెరిగి, రూ. 5,31,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,310గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 వృద్ధి చెంది.. రూ. 57,930కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,490గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4,400 పెరిగి.. రూ. 5,79,300గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,080గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 57,930గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,930గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 53,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,930గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,930గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,980గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 53,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,930గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,260గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 72,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 73,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 68,000.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ.400 తగ్గి.. రూ 27,160కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,560గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,160గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం