Gold and silver rates today : దిగొచ్చిన పసిడి, పెరిగిన వెండి ధరలు- నేటి లెక్కలివే
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి.. రూ. 52,250కి చేరింది. శనివారం ఈ ధర రూ. 52,350గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,000 తగ్గి రూ. 5,22,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,225గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 తగ్గి.. రూ. 57,060కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 500 తగ్గి.. రూ. 5,70,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,706గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,210గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 57,060గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,060గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,250గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,110గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,230గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 72,300గా కొనసాగుతోంది. శనివారం ఈ ధర రూ. 72,100గా ఉండేది..
Silver rates today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,300.. బెంగళూరులో రూ. 74,300గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 250 పెరిగి.. రూ 27,130కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,880గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,130గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం