Gold and silver rates today : రూ. 56వేల దిగువకు పసిడి ధర.. మరింత తగ్గిన వెండి!
Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. శనివారం కూడా తగ్గాయి. ప్లాటీనం రేట్లు మాత్రం పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 దిగొచ్చి.. రూ. 55,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3000 తగ్గి, రూ. 5,58,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,580గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 330 తగ్గి.. రూ. 60,870కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,200గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3300 దిగొచ్చి.. రూ. 6,08,700గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,087గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,020గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,870గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,920గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,920గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,430గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 తగ్గి.. రూ. 74,300కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 74,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,300.. బెంగళూరులో రూ. 78,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 తగ్గి.. రూ 28,450కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,300గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం