Gold and silver rates today : స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు..-gold and silver rates today 20 november 2022 news in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 20 November 2022 News In Telugu

Gold and silver rates today : స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 06:22 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 48,600కి చేరింది. శనివారం ఈ ధర రూ. 48,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 4,86,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 4,860గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 53,020కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 53,180గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 5,30,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,302గా ఉంది.

Gold rates today in Hyderabad : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,170గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 53,020గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,730గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,630గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 53,100గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,020గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 53,070గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,020గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా ఆదివారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,090గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 300 తగ్గి.. రూ. 60,900కి చేరింది.

Silver rate in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 67,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 60,900.. బెంగళూరులో రూ. 67,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం మరింత పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 తగ్గి.. రూ 25,670కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,760గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం