Gold and silver rates today : గుడ్ న్యూస్.. మరింత తగ్గిన పసిడి, వెండి ధరలు..
Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. కాగా.. ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 దిగొచ్చి.. రూ. 56,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 56,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2000 తగ్గి, రూ. 5,61,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,610గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 తగ్గి.. రూ. 61,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,420గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2200 దిగొచ్చి.. రూ. 6,12,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,120గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,350గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,200గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,150గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,250గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,250గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,450గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 74,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,600గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,500.. బెంగళూరులో రూ. 78,100గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 పెరిగి.. రూ 28,300కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,170గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం