Gold rates today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే
Gold rates today Hyderabad : దేశంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఆ వివరాలు..
Gold rates today Hyderabad : దేశంలో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 190 పెరిగి.. రూ. 52,200కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 52,010గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,900 పెరిగి, రూ. 5,22,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,220గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 210 వృద్ధి చెంది.. రూ. 56,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 56,740గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,100 పెరిగి.. రూ. 5,69,500గా ఉంది.
Gold and Silver rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,350గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 56,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,170గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,200గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,950గాను ఉంది.
Gold rate today in Vijayawada : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,250గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,200గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 150 పెరిగి రూ. 72,900కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 72,750గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 75,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,900.. బెంగళూరులో రూ. 75,800గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి.. రూ 27,830కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,780గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం