Gold and silver rates today : హైదరాబాద్లో.. రూ. 52,000పైనే బంగారం ధర!
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 52,010కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 52,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 5,20,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,201గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 56,740కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 56,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 5,67,400గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 56,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,970గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,780గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,740గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,740గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,060గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,790గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,740గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,275గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 72,750గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,750.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 70 తగ్గి.. రూ. 27,780కి చేరింది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,780గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం