Gold and silver rates today : హైదరాబాద్లో పసిడి @52వేలు- వెండి @75000!
Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం కూడా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 52,000కి చేరింది. శనివారం ఈ ధర రూ. 51,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.4,000 పెరిగి, రూ. 5,20,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,200గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 వృద్ధి చెంది.. రూ. 56,730కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 56,290గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4,400 పెరిగి.. రూ. 5,67,300గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,980గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 56,730గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,960గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,770గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,730గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,780గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,730గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,275గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 750 పెరిగి రూ. 72,750కి చేరింది. శనివారం ఈ ధర రూ. 72,750గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 75,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,750.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 దిగొచ్చి.. రూ 27,850కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,000గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,850గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం
Gold prices: రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర
January 13 2023
Gold price in 2023 : 2023లో బంగారం ధర @62,000- వెండి ధర @80,000..!
December 30 2022