Telugu News  /  Business  /  Gold And Silver Rates Today 14th January 2023 Check Latest Prices In Telugu States
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver rates today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

14 January 2023, 6:18 ISTChitturi Eswara Karthikeya Sharath
14 January 2023, 6:18 IST

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. ఆ వివరాలు..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 51,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 51,400గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 5,16,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,160గా కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 వృద్ధి చెంది.. రూ. 56,290కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 56,070గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,200 పెరిగి.. రూ. 5,62,900గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,440గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 56,290గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 51,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,290గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,290గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,340గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 51,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,290గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,200గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 72,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 71,900గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,000.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 తగ్గి.. రూ 27,850కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,000గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,850గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)