Gold and silver rates today : రూ. 52వేలకు చేరువలో పసిడి ధర.. రూ. 75వేల వద్ద వెండి!
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 51,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 51,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3000 పెరిగి, రూ. 5,16,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,160గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 330 వృద్ధి చెంది.. రూ. 56,290కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 55,960గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3300 పెరిగి.. రూ. 5,62,900గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,440గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 56,290గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,380గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 51,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,290గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,290గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,340గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 51,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,290గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,180గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 71,800గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 71,800.. బెంగళూరులో రూ. 74,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం తగ్గింది. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 30 తగ్గి.. రూ. 28,800కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 28,830గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం