Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 దిగొచ్చి.. రూ. 53,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 53,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5000 తగ్గి, రూ. 5,31,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,310గా ఉంది.,మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 తగ్గి.. రూ. 57,930కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 58,470గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5400 దిగొచ్చి.. రూ. 5,79,300గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,793గా ఉంది.,Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,080గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 57,930గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.,కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,070గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 53,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,930గాను ఉంది.,Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,930గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.,అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,980గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 53,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,930గా ఉంది.,ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.,వెండి కూడా..దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,380గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 900 తగ్గి.. రూ. 73,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 74,700గా ఉండేది.,Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 73,800.. బెంగళూరులో రూ. 76,000గా ఉంది.,ప్లాటీనం ధరలు ఇలా..దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 470 పెరిగి.. రూ 26,980కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,510గా ఉండేది.,ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,980గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.),