Gold and silver rate today : స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధర.. కాస్త పెరిగిన వెండి రేటు!-gold and silver rate today 7th november 2023 check prices here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today : స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధర.. కాస్త పెరిగిన వెండి రేటు!

Gold and silver rate today : స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధర.. కాస్త పెరిగిన వెండి రేటు!

Sharath Chitturi HT Telugu

Gold and silver rate today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా... (REUTERS)

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 56,350కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 56,500గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 5,63,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,635గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 170 తగ్గి.. రూ. 61,470కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,640గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1700 దిగొచ్చి.. రూ. 6,14,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,147గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,500గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,620గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,350 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,470గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,470గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,350గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,470గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,400గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,520గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,350గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,470గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,520గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 75,200కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 75,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,200.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం