Gold price today : భారీగా పడిన పసిడి ధరలు.. కొనుగోళ్లకు ఇదే సరైన సమయం!
Gold price today : దేశంలో పసిడి ధరలు భారీగా పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold price today : దేశంలో బంగారం ధరలు ఆదివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 700 దిగొచ్చి.. రూ. 55,300కి చేరింది. శనివారం ఈ ధర రూ. 56,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7000 తగ్గి రూ. 5,53,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,530గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 770 తగ్గి.. రూ. 60,330కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,100గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7700 పెరిగి.. రూ. 6,03,300గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,033గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,480గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,330గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,380గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,380గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 తగ్గి.. రూ. 73,000కి చేరింది. శనివారం ఈ ధర రూ. 73,400గా ఉండేది.
Silver rate today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 73,000.. బెంగళూరులో రూ. 74,300గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 26,620గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,620గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం