Gold Rate Today : మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇలా
Gold Rate Today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలాంటి నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.92 పెరిగి రూ.82,850కి చేరింది. మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.85 పెరిగి.. రూ.75,950 చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 75,100గా ఉండేది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,595గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర రూ.7,59,500గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 76,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,000గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 75,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 82,850గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,850గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 75,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 82,850గాను ఉంది.
హైదరాబాద్లో బంగారం ధరలు
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,850గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,000గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 82,900గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 75,950గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,850గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,650గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 96,500గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఈ ధర రూ. 96,500గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,04,100 పలుకుతోంది. పది గ్రాముల వెండి ధర రూ.1040గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 96,500.. బెంగళూరులో రూ. 96,500గా ఉంది.