Gold and silver rate today : భారీగా పతనమైన వెండి ధర.. పసిడి కూడా!
Gold and silver rate today : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్లాటీనం రేట్లు కూడా దిగొచ్చాయి. ఆ వివరాలు..
Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 55,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 5,57,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,570గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 తగ్గి.. రూ. 60,760కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1700 దిగొచ్చి.. రూ. 6,07,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,076గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,930గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,760గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,310గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,810గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,810గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,280గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 4000 తగ్గి.. రూ. 72,800కి చేరింది. గురువారం ఈ ధర రూ. 76,800గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,800.. బెంగళూరులో రూ. 77,600గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 370 తగ్గి.. రూ 26,540కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,910గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,540గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం