Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి రూ. 58,000 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 57,800గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 5,80,000 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,800 గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 220 వృద్ధి చెంది రూ. 63,270కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 63,050 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 2200 పెరిగి రూ. 6,32,700 కి చేరింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,420 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,270 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,600 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,930 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,27గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,270 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,050 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,320 గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,270 గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు కూడా బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,650గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధి చెంది రూ. 76,500 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 76,200 గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,500.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)