Gold and silver price today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 67,100 కి చేరింది. మంగళవవారం ఈ ధర రూ. 66,850 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 2500 పెరిగి, రూ. 6,71,000 కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,710గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 270 పెరిగింది. బుధవారం ఈ ధర రూ. 73,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,32,000గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,200 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,910గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,220గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,220 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర (gold rate) రూ. 67,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,250గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,220గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు (silver rate) బుధవారం కూడా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9770 పలుకుతోంది. మంగళవారం ఈ ధర రూ. 9650 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 97,700గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 96,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర (silver rate) రూ. 1,02,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 97,700.. బెంగళూరులో రూ. 95,250గా ఉంది.
దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 100 పెరిగి రూ. 28,320కి చేరింది. క్రితం రోజు రూ. 28,220గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,320 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)