Gold and silver prices today : దేశంలో ఆదివారం పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. భారత్ లోని వివిధ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold and silver prices today : దేశంలో బంగారం (gold rate) ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,400లుగా కొనసాగుతోంది. శనివారం ఈ ధర రూ. 66,390 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,64,000 కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,640 గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 72,440గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,24,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,244 గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,590గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,440గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర (gold rate)రూ. 66,550 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,600గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,400గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,440 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,450గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,490గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,440 గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Silver price today in Hyderabad : దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,150 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 91,500 కి చేరింది. ఇప్పుడు హైదరాబాద్ లో 10 గ్రాములు వెండి ధర రూ. 9600 పలుకుతోంది. అంటే, కేజీ వెండి ధర రూ. 9,60,000 కి చేరుకుంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 91,500.. బెంగళూరులో రూ. 92,500గా ఉంది. కేరళ, పూణె, పట్నాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)