Gold price today: మీ నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
Gold price today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Gold price today : దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,190 గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,61,900 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,619గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 72,210 గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,22,100 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,221 గా ఉంది.
బెంగళూరులో బంగారం ధర
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు గురువారం ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,340గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,360 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,190 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,210 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,970గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,060 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,190 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,210 గాను ఉంది.
హైదరాబాద్లో గోల్డ్ ధర
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,190 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,210 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,240 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,260 గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,190 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,210 గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
Silver price today : దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గినవి. 100 గ్రాముల వెండి ధర రూ. 70 తగ్గి రూ. 9090 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 9,160 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 700 తగ్గి.. రూ. 90,900 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 91,600 గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 95,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 90,900.. బెంగళూరులో రూ. 90,900గా ఉంది.
ప్లాటినం ధరలు ఇలా..
దేశంలో ప్లాటినం రేట్లు గురువారం పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 140 పెరిగి రూ. 26,260 కి చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 26,120 గా ఉంది. ఇక హైదరాబాద్లో ప్లాటినం ధర(10గ్రాములు) రూ. 26,260 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)