Gold price today: తగ్గుతున్న పసిడి ధర; కొనేందుకు ఇదే సరైన సమయమా?
Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,740కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,750 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,67,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,674 గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,810 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,820 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,28,100 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,281గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,890 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,960 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,810 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,970 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,810గాను ఉంది.
హైదరాబాద్ లో బంగారం ధర
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,810 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,860గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,810గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
బుధవారం వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,730 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 87,300 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 87,400 గా ఉండేది.
Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.90,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 87,300.. బెంగళూరులో రూ. 85,900 గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)