Gold price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గినవి. వెండి ధరలు స్థిరంగా క కొనసాగుతున్నాయి. ప్లాటినం రేట్లలో పెద్దగా మార్పు లేదు. పూర్తి వివరాలు..

బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 270 తగ్గి.. రూ. 63,340 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 63,610గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 2700 తగ్గి, రూ. 6,33,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,334గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 290 తగ్గి.. రూ. 69,100కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 69,390 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 2900 తగ్గి.. రూ. 6,91,000గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు బుధవారం ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,250గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,340 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 69,100గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,140 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 63,340గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 69,100గాను ఉంది.
హైదరాబాద్ లో బంగారం ధర
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,340గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,390గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 69,150 గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63,340గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,100గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,910గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 79,100కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 78,600గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 82,100 కి చేరింది. వెండి ధరలు కోల్కతాలో రూ. 79,100.. బెంగళూరులో రూ. 77,400గా ఉంది.
ప్లాటినం ధరలు ఇలా..
దేశంలో ప్లాటినం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ 24,420 గా ఉంది. ఇక హైదరాబాద్లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)