Gold and silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు..-gold and silver prices today in hyderabad 31st july 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పడిన పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు మరింత పడ్డాయి. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు మాత్రం పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Ritik Jain)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 63,190కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 63,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,31,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,319గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 68,940కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 68,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,89,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,894గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,340గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,090గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,190 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 68,940గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,640గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 63,190గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 68,940గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,190గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,940గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,240గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 68,990గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63,190గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,940గా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు, బంగారంపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గించడం వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,440గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 84,400కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 84,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,400.. బెంగళూరులో రూ. 84,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 190 పెరిగి.. రూ 25,570కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,380గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,570గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం