Gold and Silver prices today : ఫిబ్రవరి 8 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..-gold and silver prices today 8th feb 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : ఫిబ్రవరి 8 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..

Gold and Silver prices today : ఫిబ్రవరి 8 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu
Published Feb 08, 2025 05:42 AM IST

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ఫిబ్రవరి 8న మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ చెక్​ చేయండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 86,500కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 86,510గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 8,65,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,650గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 79,290కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 79,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 7,92,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 7,929గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 86,500గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,500గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 79,290గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 86,500గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,290గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,500గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,340గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 86,550గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 79,290గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,500గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,940గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 99,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 99,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,06,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 99,400.. చెన్నైలో రూ. 99,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం