Gold and Silver prices today : మరింత పెరిగిన పసిడి ధరలు- తగ్గిన వెండి రేటు, నేటి లెక్కలివే..-gold and silver prices today 7 november 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పెరిగిన పసిడి ధరలు- తగ్గిన వెండి రేటు, నేటి లెక్కలివే..

Gold and Silver prices today : మరింత పెరిగిన పసిడి ధరలు- తగ్గిన వెండి రేటు, నేటి లెక్కలివే..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి రేట్లు స్వల్పంగా పడ్డాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 80,360కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 80,350గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,03,600గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 73,6610కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 73,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,36,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,360గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,810గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,510గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 80,360గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,660గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,360గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 73,360గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 80,360గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,360గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,360గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,710గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 80,410గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,360గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,360గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, గోల్డ్​ బయ్యింగ్​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,590గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 95,900కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 96,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,04,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,900.. బెంగళూరులో రూ. 95,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 20 పెరిగి.. రూ 26,600కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,580గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం