Gold and silver prices today : మళ్లీ రూ. 67వేలు దాటిన పసిడి ధర.. వెండి రేటు ఎంతంటే!
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా. ప్లాటీనం రేట్లు కూడా పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,010కి చేరింది. గురువారం ఈ ధర రూ. 67,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,70,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,701గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 73,100కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,090గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,31,000గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,250గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,100గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,760గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,100గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,060గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,150గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,100గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,310గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 93,100గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 97,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 93,100.. బెంగళూరులో రూ. 92,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 220 వృద్ధి చెంది రూ. 26,9300 చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,710గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,930గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం