దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 70 పెరిగి.. రూ. 99,023కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ.700 పెరిగి, రూ. 9,90,230కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 9,902గా కొనసాగుతోంది.
మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 200 వృద్ధి చెంది.. రూ. 90,983కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 2,000 పెరిగి.. రూ. 9,09,830గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,625గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,865గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,635 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 98,875గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,631గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,871గా ఉంది. ఇక ముబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 90,637గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,877గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,639గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,879గా నమోదైంది. విజయవాడలో రేట్లు వరుసగా రూ. 90,645- రూ. 98,885గాను విశాఖపట్నంలో రూ. 90,647- రూ. 98,887గా ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,691గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,931గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,630గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,870గా ఉంది.
ట్రంప్ టారీఫ్ ప్రకటనలు, అమెరికా- చైనా మధ్య అనిశ్చితి, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,320గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,03,200కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,14,500 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ. 1,15,300.. విశాఖపట్నంలో రూ. 1,12,900గా ఉంది.
సంబంధిత కథనం