జూన్​ 4 : షాకింగ్​! తెలుగు రాష్ట్రాల్లో రూ. 99 వేలకు చేరువలో బంగారం ధర..-gold and silver prices today 4th june 2025 in hyderabad and vijayawada other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 4 : షాకింగ్​! తెలుగు రాష్ట్రాల్లో రూ. 99 వేలకు చేరువలో బంగారం ధర..

జూన్​ 4 : షాకింగ్​! తెలుగు రాష్ట్రాల్లో రూ. 99 వేలకు చేరువలో బంగారం ధర..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 70 పెరిగి.. రూ. 99,023కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ.700 పెరిగి, రూ. 9,90,230కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,902గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 200 వృద్ధి చెంది.. రూ. 90,983కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 2,000 పెరిగి.. రూ. 9,09,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,625గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,865గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,635 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,875గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,631గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,871గా ఉంది. ఇక ముబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,637గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,877గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,639గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,879గా నమోదైంది. విజయవాడలో రేట్లు వరుసగా రూ. 90,645- రూ. 98,885గాను విశాఖపట్నంలో రూ. 90,647- రూ. 98,887గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,691గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,931గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,630గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,870గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ ప్రకటనలు, అమెరికా- చైనా మధ్య అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,320గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,03,200కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,500 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,15,300.. విశాఖపట్నంలో రూ. 1,12,900గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం