Gold and Silver prices today : జనవరి 4 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..-gold and silver prices today 4th jan 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జనవరి 4 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver prices today : జనవరి 4 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడ వృద్ధిచెందాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 72,610కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 72,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,26,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,261గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 79,210కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 79,200గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,92,100గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,360గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,610 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 79,210గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,210గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 72,610గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 79,210గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,610గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,210గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,660గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 79,260గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,610గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,210గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,260గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 92,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 92,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,600.. బెంగళూరులో రూ. 92,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం