Gold and silver prices today : రూ. 83వేలు దాటేసిన బంగారం ధర! వెండి రేటుకు రెక్కలు..-gold and silver prices today 31st jan 2025 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 83వేలు దాటేసిన బంగారం ధర! వెండి రేటుకు రెక్కలు..

Gold and silver prices today : రూ. 83వేలు దాటేసిన బంగారం ధర! వెండి రేటుకు రెక్కలు..

Sharath Chitturi HT Telugu
Jan 31, 2025 05:34 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీ నగరాల్లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా..

మీ నగరాాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 83,030కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 83,020గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,30,300గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 76,110కి చేరింది. గురువారం ఈ ధర రూ. 76,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,61,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,611గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 76,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,180గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 76,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 83,030గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 76,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 83,030గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 76,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 83,030గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 76,110గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 83,030గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 76,160గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 83,080గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 76,110గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 83,030గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,06,100గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 1,06,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,06,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 98,600.. బెంగళూరులో రూ. 98,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం