Gold and silver prices today : బంగారం కొనాలంటే ఇదే రైట్​ టైమ్​! నేటి పసిడి ధరలు ఇలా..-gold and silver prices today 3 november 2024 in hyderabad and telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : బంగారం కొనాలంటే ఇదే రైట్​ టైమ్​! నేటి పసిడి ధరలు ఇలా..

Gold and silver prices today : బంగారం కొనాలంటే ఇదే రైట్​ టైమ్​! నేటి పసిడి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​టైమ్​ హై నుంచి కాస్త పడ్డాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Hindustan Times)

దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 80,400గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,04,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,040గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 73,700గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7,37,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,370గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,550గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 80,400గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,400గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 73,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 80,400గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,400గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 80,450గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,400గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,700గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 97,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,06,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 97,000.. బెంగళూరులో రూ. 97,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం