Gold and silver prices today : అక్టోబర్​ 29 : హైదరాబాద్​, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇలా..-gold and silver prices today 29th october 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : అక్టోబర్​ 29 : హైదరాబాద్​, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Gold and silver prices today : అక్టోబర్​ 29 : హైదరాబాద్​, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి రేట్లు సైతం స్వల్పంగా దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 79,790కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 79,800గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,97,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,979గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 73,140కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 73,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 7,31,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 7,314గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,940గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 79,790గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,790గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 73,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 79,790గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,790గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 79,840గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,190గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,840గా ఉంది.

అంతర్జాతీయ అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,790గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 97,900కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 98,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,06,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 97,900.. బెంగళూరులో రూ. 96,900గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం