Gold and silver prices today : మరింత పడిన పసిడి ధర.. కొనుగోలుకు ఇదే రైట్​ టైమ్​!-gold and silver prices today 28th may 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పడిన పసిడి ధర.. కొనుగోలుకు ఇదే రైట్​ టైమ్​!

Gold and silver prices today : మరింత పడిన పసిడి ధర.. కొనుగోలుకు ఇదే రైట్​ టైమ్​!

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు మాత్రం పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 65,740కి చేరింది. గురువారం ఈ ధర రూ. 65,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,57,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,574గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 71,720కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,17,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,870గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,720గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,720గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,720గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,770గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,720గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,990గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 89,900కి చేరింది. గురువారం ఈ ధర రూ. 90,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 94,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 89,900.. బెంగళూరులో రూ. 89,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 500 పెరిగి.. రూ. 27,030కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,530గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,030గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం